• Mobile No : 88856 18111

Category: TELANGANA

మళ్లీ దరఖాస్తుల పరిశీలన

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవో నంబరు 59 కింద దరఖాస్తు చేసుకొన్న వారందరి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు పరిశీలించనుంది. అయితే 2022 మార్చి నాటి మార్కెట్‌ విలువలే (రిజిస్ట్రేషన్‌ వాల్యూ) ప్రామాణికంగా క్రమబద్ధీకరణ రుసుం తీసుకోనున్నారు. దీంతో దరఖాస్తుదారులకు రుసుం భారీగా పెరిగే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణ కోసం జీవో నంబరు 59 కింద దరఖాస్తులు చేసుకొనేందుకు ప్రభుత్వం విధించిన కటాఫ్‌ తేదీని ఎత్తివేస్తూ చీఫ్‌ […]

నేత్రపర్వంగా దివ్యవిమాన రథోత్సవం

యాదగిరిగుట్ట, మార్చి 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వెండి గరుడ సేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం నేత్రపర్వంగా సాగాయి. ప్రత్యేక పూజల అనంతరం వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో స్వామివారి దివ్య విమానరథాన్ని అలంకరించారు. పట్టువస్త్రాలు, బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలతో నూతన కల్యాణ దంపతులైన లక్ష్మీనారసింహులను అలంకరించి ప్రత్యేకసేవలో తీర్చిదిద్దారు. దివ్యవిమాన రథంపై అధిష్ఠింపజేశారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో మంగళవాయిద్యాలు.. మేళతాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. […]

మెస్‌ బిల్లులు 25% పెంపు?

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల మెస్‌ (డైట్‌) బిల్లుల పెంపునకు రంగం సిద్ధమైంది. మెస్‌ బిల్లులను 25 శాతం మేర పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు నేతృత్వంలోని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు ఓ నివేదికను పంపింది. ఆ ప్రతిపాదనలకు సీఎం ఆమోదముద్ర పడితే కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2017లో చివరిగా రాష్ట్రంలో మెస్‌ చార్జీలను పెంచారు. పెరిగిన […]

KTR : మహిళా దినోత్సవాన మోదీ కానుక ఇదేనా?

హైదరాబాద్‌, హిమాయత్‌ నగర్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్ల ధరల పెంపుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు మండిపడ్డారు. మహిళా దినోత్సవాన దేశంలోని ఆడబిడ్డలకు ప్రధాని మోదీ ఇచ్చిన కానుక ఇదేనా అని ప్రశ్నించారు. సిలిండర్‌ ధర పెంపు నేపథ్యంలో పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మోదీ సర్కారు రాకముందు రూ.400గా ఉన్న గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.1150కి పెరిగిందని, ఇప్పుడు పెంచిన రూ.50తో కలిపి రూ.1200కి చేరుకుందని అన్నారు. ఈ […]

CM KCR : నేనూ ముసలోణ్ని అవుతున్నా..!

69 ఏళ్లు వచ్చినయ్‌.. నేనున్నన్ని రోజులు పోచారం ఉండాల్సిందే ఆయన యువకుడిలా పనిచేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌ సభలో కేసీఆర్‌ టీటీడీ ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు సతీసమేతంగా బ్రహ్మోత్సవాలకు హాజరు సీఎం చేతుల మీదుగా శ్రీవారికి స్వర్ణ కిరీటం   కామారెడ్డి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ‘‘స్పీకర్‌ పోచారం వయసైపోయిందని అంటున్నారు. కానీ, ఆయన బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం యువకుడిలా పనిచేస్తున్నారు. నేనూ ముసలోణ్ని అవుతున్నా.. 69 ఏళ్లు వచ్చినయ్‌. […]

అవును… వీరతాళ్ళు వెయ్యాల్సిందే!

జూలూరు గౌరీశంకర్, రమేష్ హజారి అను మేము… చెప్పిందే చేస్తున్నాం, చేసేదే చెపుతున్నాం. గతంలో మేము రాసిన వేర్వేరు వ్యాసాలపై (ఆంధ్రజ్యోతి, జనవరి 17, 28) బిఆర్ బాపూజీ ‘వేయండి వీరికి వీరతాళ్లు’ అంటూ (ఫిబ్రవరి 15) ఉమ్మడిగా ఆరోపణలు చేశారు కనుక, ఉమ్మడిగానే ఇస్తున్న సమాధానం ఇది.   గౌరీశంకర్‌గానో, సాహిత్య అకాడమి చైర్మన్‌గానో, పిఆర్వోగానో, రమేష్ హజారిగానో మాకు ఒక అధినేత లేదా ఒక ప్రభుత్వ విధానం నచ్చితే, దాన్ని మేం ప్రశంసిస్తే అది […]