• Mobile No : 88856 18111

Category: ANDHRA PRADESH

రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న వైసీపీ

ఉయ్యూరు, మార్చి 1 : అరాచక, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభు త్వం అధోగతిపాలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పెద ఓగిరాలలో బుధవారం ఇంటింట ప్రచారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచ కాలు, అవినీతి, ధరల పెరుగుదలను పార్టీ నాయకుడు పోతిరెడ్డి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసేవారిపై అక్రమ కేసులు పెట్టి అణిచివేయటం పరిపాటైంద ని విమర్శించారు.

బండ బాదుడు

విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): సామాన్యుల నడ్డివిరిగేలా కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్‌ బండ ధర పెంచింది. ‘అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మార్పు’ అనే విధానంతో ఎప్పటికప్పుడు రేటు పెంచుతోంది. తాజాగా మరోసారి 14.5 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచింది. ప్రస్తుతం విశాఖపట్నంలో వంట గ్యాస్‌ ధర రూ.1,061గా ఉంది. బుధవారం నుంచే కొత్త ధర రూ.1,111తో పంపిణీ చేయడం ప్రారంభించారు. గతంలో రూ.900 సిలిండర్‌ ధర వున్నప్పుడు రూ.400 వరకు రాయితీ […]

రేపటి నుంచి పెట్టుబడుల సదస్సు

విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో శుక్ర, శనివారాల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరగనుంది. ఇందుకోసం నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు. రాత్రింబవళ్లు ఫుట్‌పాత్‌లకు రంగులేస్తూ, విద్యుద్దీపాలు అమరుస్తూ కూలీలు శ్రమిస్తూనే ఉన్నారు. మైదానంలో కూడా ఏర్పాట్లు పూర్తికాలేదు. ఇంకా 30 శాతం పనులు మిగిలే ఉన్నాయి. జర్మన్‌ హ్యాంగర్ల నిర్మాణం, ప్రవేశ ద్వారాల ఏర్పాటు పూర్తికాగా వేదికల నిర్మాణం, హోర్డింగ్‌ల ఏర్పాటు పనులు ఇంకా సాగుతున్నాయి. అవి పూర్తయిన తరువాత […]

విశాఖ ఉక్కు దివాలా!?

కుక్కను చంపడానికి.. పిచ్చిదన్న ముద్ర ఎలాగైతే వేస్తారో.. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ కేంద్రం ఇదే పద్ధతి పాటిస్తోంది. ఏ దశలోనూ చేయూతనివ్వకుండా అడుగడుగునా దానిని నష్టాల పాల్జేస్తూ.. దివాలా దిశగా నడిపిస్తోంది. అస్మదీయ కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకే నాటకమాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌).. అంటే విశాఖ ఉక్కు కర్మాగారం. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో తెలుగువారి ఉద్యమ ఫలితంగా ఏర్పడిందీ సంస్థ. పుట్టినప్పటి నుంచీ […]

రుషికొండపై జగన్‌ కన్నేశారు

న్యూఢిల్లీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికలకు ముందు… మీకు కూలివాడిలాగా పనిచేస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి’ అని బతిమాలిన వ్యక్తులు, ఇప్పుడు రాచరికాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఏప్రిల్‌ నుంచి విశాఖ రాజధాని గా సీఎం జగన్‌ పరిపాలిస్తారని సుబ్బారెడ్డి చెబుతున్నారని, ఎవరికి వారే రాజులమని అనుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. విశాఖలో రుషికొం డ నిర్మాణాలపై హైకోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ, భవనాల పనులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని చెప్పారు. […]

Taxes Thieves : వాణిజ్య పన్నుల శాఖలో దొంగలు పడ్డారు!

‘ఒక దేశం… ఒకే పన్ను’ పేరుతో కేంద్రం జీఎస్టీ ప్రవేశపెట్టింది! ఇంకేముంది… పన్ను ఎగవేతలకు అన్ని దారులూ మూసుకుపోయాయని అంతా అనుకుంటున్నారు.